
రామచంద్రాపురం/పటాన్చెరు,వెలుగు: పాశమైలారం ప్రమాదంలో గాయపడి పటాన్చెరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్సీ కవిత మంగళవారం పరామర్శించారు. ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులతో మాట్లాడి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. వారికి ఆర్ధిక భరోసా కల్పించాల్సి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.